'ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు ఇవ్వాలి'
SRCL: 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా సర్పంచ్లు,మున్సిపల్ ఛైర్మన్, ఛైర్పర్సన్, వార్డు సభ్యులకు ఈ నెల 12వ తేదీన శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు ఆదేశించారు. పంచాయతీ రాజ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కార్యదర్శి శ్రీదేవితో కలిసి కలెక్టర్ గరిమా అగర్వాల్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.