అసాంఘిక శక్తులకు అడ్డాగా కొత్త ఆటోనగర్?
కృష్ణా: అసాంఘిక, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కానూరు కొత్త ఆటోనగర్ అడ్డాగా మారింది. నిత్యం వేల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తుంటారు. సమీపంలోనే VIP, అధికారుల నివాసాలు ఉంటాయి. అయిన 28 మంది మావోయిస్టులు పట్టుబడే వరకు నిఘా, స్పెషల్బ్రాంచ్, పోలీసుల పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం. రాత్రి 7గం.తర్వాత కార్మికుల సంచారం లేకపోవడం సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు మరో కారణంగా తెలుస్తోంది.