సచివాలయంలో భూమి కేటాయింపులపై సమీక్ష
GNTR: అమరావతి సచివాలయంలో సీఆర్డీఏ ఆధ్వర్యంలో పలు సంస్థలకు భూమి కేటాయింపులపై మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా హాజరయ్యారు. రాజధాని ప్రాంతంలో భూముల కేటాయింపు ప్రక్రియ, అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక వసతుల ఏర్పాటు అంశాలపై అధికారులు వివరణ ఇచ్చారు.