మొంథా ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు

మొంథా ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు

MNCL: మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ గురువారం రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సింగరేణి ప్యాసింజర్ రైలును బల్లార్షా నుంచి కాజీపేట స్టేషన్ వరకు మాత్రమే నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు.