ప్రైవేటు రంగాల్లో సైతం యువత రాణించాలి: కలెక్టర్
ADB: మావల మండల కేంద్రంలోని N-Labs ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ సంస్థను కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్తో కలిసి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఐటీ విభాగం పనితీరు, సిబ్బంది వివరాలను ప్రతినిధులు కలెక్టర్ రాజర్షి షాకు వివరించారు. యువత ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు రంగాలలో సైతం రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు ప్రణవి, అంకిత్, దినేష్ ఉన్నారు.