జిల్లాలో దారుణ హత్య
నెల్లూరు: జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. జలదంకి మండలం, గట్టుపల్లి చింతలపాలెం వద్ద బుధవారం గొట్టిపాటి ప్రసాద్ తన కోళ్ల ఫారంలో నిద్రిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందిన వెంటనే జలదంకి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ దారుణ హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.