'ఫిర్యాదుల పరిష్కారానికి ఐటీడీఏ పల్స్'
ADB: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఐటీడీఏ పల్స్ పేరుతో రూపొందించిన ఈ నూతన ప్లాట్ఫామ్ను ITDA PO యువరాజ్ మర్మట్ సోమవారం ఉట్నూర్లో ప్రారంభించారు. గిరిజన ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచనున్నట్లు పేర్కొన్నారు. ఐటీడీఏకు వచ్చే ప్రతి ఫిర్యాదు నూతన వ్యవస్థలోనే నమోదవుతుందని ఆయన స్పష్టం చేశారు.