'నా రాజధాని అమరావతి అంటూ గర్వంగా చాటాలి'
అమరావతి బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించడంపై నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం దీపాలు వెలిగించి తమ మద్దతు తెలిపి హర్షాతిరేకాలు తెలియజేశారు. ఇది ప్రజా రాజధాని అని .. నా రాజధాని అమరావతి అంటూ గర్వంగా చాటాలన్నారు.