డ్యామ్‌లో పడి ముగ్గురు గల్లంతు

డ్యామ్‌లో పడి ముగ్గురు గల్లంతు

AP: మన్యం జిల్లా కొమరాడ మండలం జంఝావతి రబ్బరు డ్యామ్‌లో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శివిని గ్రామానికి చెందిన శరత్, గోవింద్‌నాయుడు, ప్రదీప్ తమ బంధువులతో కలిసి రబ్బర్ డ్యామ్‌లో ఈతకు వెళ్లారు. డ్యామ్‌లో ఓ బాలుడు పడిపోతుండగా.. అతడిని రక్షించేందుకు వెళ్లి ఈ ముగ్గురూ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.