పెనుగంచిప్రోలులో పర్యటించిన నీతి ఆయోగ్ బృందం
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం, సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమాల అమలును పరిశీలించేందుకు నీతి ఆయోగ్ అధికారి రాధిక మూలయా పర్యటించారు. ముళ్లపాడు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, చెత్త సేకరణ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రభుత్వ వైద్యశాలను సందర్శించినట్లు ఆమె తెలిపారు.