'భక్తితోనే జీవన శైలిలో మార్పు'
ASR: ప్రతి ఒక్కరికీ దైవ భక్తి అవసరమని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఈ మేరకు గురువారం అరకులోయ మండలంలోని కరాయిగుడ గ్రామంలో ఉన్న అలేఖ్ మహిమ ఆశ్రమంలో నిర్వహించిన సిద్దే గణేశ్వర బాబా 81వ జయంతి వేడులలో ఆయన పాల్గొన్నారు. నైతిక విలువలు పెరుగుటకు దైవ భక్తి దోహదపడుతుందని, భక్తి వలన జీవన శైలిలో మంచి మార్పులు వస్తాయని పేర్కొన్నారు.