జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ పరతోష్ పంకజ్ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. మొత్తం 14 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్సైలకు ఆదేశించారు.