ఫోటో గ్రాఫర్ల భవనానికి 'బోరు' దాతగా మాజీ కౌన్సిలర్
దేవరకొండలో స్థానిక వీడియో, ఫోటో అసోసియేషన్ భవన అవసరాల కోసం 20వ వార్డు మాజీ కౌన్సిలర్ కొండ్ర మల్లేశ్వరి శ్రీశైలం యాదవ్ మంచినీటి బోరును వేయించి తన ఉదారతను చాటుకున్నారు. భవన నిర్మాణంలో ఎదురవుతున్న నీటి ఎద్దడిని గుర్తించిన ఆమె సొంత ఖర్చులతో బోరు వేయించి ఫోటోగ్రాఫర్లకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.