శ్రీవారి దర్శనానికి 15 గంటలు

శ్రీవారి దర్శనానికి 15 గంటలు

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న(బుధవారం) శ్రీవారిని 75,688 మంది భక్తులు దర్శించుకోగా.. 29,099 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.45 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.