'పారదర్శకంగా ప్రజలకు లబ్ధి జరగాలి'
KMM: పాలన ద్వారా ప్రజలకు పారదర్శకంగా లబ్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్రేట్లో జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో నమోదు అవుతున్న సిబ్బంది హాజరును పరిశీలించి, తక్కువ సిబ్బంది హాజరు నమోదు ఉన్న ప్రభుత్వ శాఖల అధికారులు కారణాలతో కూడిన వివరణ సమర్పించాలని ఆదేశించారు.