షేక్ హసీనా ఆదేశాలపై ఐసీటీ సంచలన తీర్పు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్(ICT) సంచలన తీర్పు వెలువరించింది. ఢాకా అల్లర్ల కేసును విచారిస్తున్న న్యాయమూర్తి.. షేక్ హసీనా ఆందోళనకారులను చంపాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఆ అల్లర్లలో 1400 మంది ప్రాణాలు కోల్పోయారని జడ్జి తెలిపారు. బలప్రయోగం ద్వారా హసీనా అధికారంలో కొనసాగాలని చూశారని ICT వ్యాఖ్యానించింది.