రైలు కిందపడి వ్యక్తి మృతి
KDP: కొండాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున మంగలి చౌడప్ప (50) అనే వ్యక్తి రైలు కింద పడడంతో మృతి చెందినట్లు ఎర్రగుంట రైల్వే ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు. మృతుడు స్థానిక మండలంలోని గండ్లూరు నివాసి అనారోగ్య కారణంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.