70 మందికి రూ.48.61 లక్షలపంపిణీ

70 మందికి రూ.48.61 లక్షలపంపిణీ

KDP: పేదలకు వైద్య చికిత్సల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి అన్నారు. బుధవారం ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కార్యాలయంలో 70 మంది లబ్దిదారులకు రూ. 48.61 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.