పథకాలపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

NLG: నల్గొండ జిల్లాను టీబి రహిత, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. జిల్లా అధికారులు, ప్రముఖ వ్యక్తులతో సోమవారం కలెక్టరేట్లో ముఖాముఖి నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్కు కలెక్టర్ వివరించారు.