వైసీపీకి ఎదురుదెబ్బ.. జనసేనలో చేరిన సర్పంచ్

వైసీపీకి ఎదురుదెబ్బ.. జనసేనలో చేరిన సర్పంచ్

కోనసీమ: రావులపాలెం మండలంలో వైసీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేవరపల్లి గ్రామ సర్పంచ్, మాజీ మండల వైసీపీ అధ్యక్షులు దొమ్మేటి అర్జున రావు వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. సోమవారం సాయంత్రం కొత్తపేట జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దొమ్మేటికి జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.