పిఠాపురంలో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్
కాకినాడ: పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆటో డ్రైవర్లకు అవగాహన, కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆటో నడిపే సమయంలో చేసే సాధారణ తప్పిదాలు, ప్రమాదాలకు గల అవకాశాలను వివరించారు. వేగం అదుపులో లేకుండా నడపడం ప్రాణాలకు హానికారకమని, పరిస్థితులను గమనిస్తూ వాహనం నడపాలని సూచించారు. నియమాలను లెక్కచేయకుండా నడిపితే జరిమానాలు, కేసులు, వాహన పత్రాలరద్దు వంటి చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.