కూసుమంచిలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

కూసుమంచిలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

KMM: కూసుమంచి మండలం నాయకన్జూడెం గ్రామంలో బుధవారం గ్రామపంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ముఖ్యంగా బొడ్రాయి బజార్లోని డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యతని, దీనివల్ల వ్యాధులు దరిచేరవని గ్రామస్తులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.