కుంగిన ట్రంక్ లైన్ను పరిశీలించిన ఎమ్మెల్యే
RR: హయత్నగర్లోని పద్మావతి కాలనీలో కుంగిన ట్రంక్ లైన్ను ఎల్బీనగర్ MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం వేసిన లైన్ ప్రస్తుత అవసరాలకు సరిపోక సమస్యలు పెరుగుతున్నాయన్నారు. కాలనీలో చెరువు నీరు డ్రైనేజీలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.