భైరవ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన డిప్యూటీ స్పీకర్,
W.G: భీమవరం బలుసుమూడిలోని వేంచేసి ఉన్న స్వయంభూ భైరవస్వామి వారిని ఇవాళ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు దర్శించికుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుష్టశక్తులను సంహరించి భక్తులను రక్షించే దేవుడు కాల భైరవుడు అన్నారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.