విద్యార్థులకు చట్టాలపై అవగాహన

ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక గౌతమి పాఠశాల, కళాశాల విద్యార్థులకు శుక్రవారం ఎస్సై నరసింహరావు గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఎక్కువగా జరుగుతున్న ఫోక్సో కేసుల చట్టాలను విద్యార్థులకు వివరించారు. చెడు వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని ఎస్సై నరసింహరావు అన్నారు.