ఎమ్మెల్యే ఆరోపణలను ఖండించిన ప్రిన్సిపాల్

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపణలను కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య ఖండించారు. తన వెనుక ఎవరూ లేరని, ఒంటరిగానే పోరాడుతున్నానని చెప్పారు. ఎమ్మెల్యే వేదింపులు నిజమని, కావాలంటే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. స్కూల్స్పై రాజకీయ నేతలకు హక్కులేదని, ఎమ్మెల్యే పెత్తనం ఏంటని ఆమె ప్రశ్నించారు.