భక్తుల కోసం చలువ పందిళ్లు ఏర్పాటు

భక్తుల కోసం చలువ పందిళ్లు ఏర్పాటు

NDL: మహానంది ఆలయంలో వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లతో పాటు భక్తుల కాళ్లు కాలకుండా కొబ్బరి పీచుతో తయారు చేసిన మ్యాట్లు వేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ చర్యలు చేపట్టామని ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. వేసవికాలం ముగిసే వరకు ఈ ఏర్పాట్లు కొనసాగుతాయని పేర్కొన్నారు.