వయోజన విద్యా శాఖ ప్రాజెక్టు అధికారికి పదోన్నతి
మంచిర్యాల జిల్లా వయోజన విద్యా శాఖ ప్రాజెక్టు అధికారి అజ్మీర పురుషోత్తం నాయక్కు పదోన్నతి లభించింది. నిజామాబాద్ జిల్లా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్గా ఆయన పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా వయోజన విద్యా జిల్లా రిసోర్స్ పర్సన్స్ శనివారం ఘనంగా సత్కరించారు. వయోజనులను విద్యావంతులను చేయడానికి పురుషోత్తం ఎంతో కృషి చేశారని కొనియాడారు.