నేటి నుంచి రాయలచెరువు రైల్వేగేటు మూసివేత

నేటి నుంచి రాయలచెరువు రైల్వేగేటు మూసివేత

ATP: యాడికి మండలం రాయలచెరువులోని చందన రహదారిలో ఉన్న రైల్వేగేటును శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గేటు, ట్రాక్ మరమ్మతులతో పాటు రహదారి పనులు చేపట్టడమే ఇందుకు కారణమని తెలిపారు. మార్చి 3వ తేదీ వరకు ఈ గేటు పూర్తిగా మూసి ఉంటుందని రైల్వే అధికారులు వివరించారు. స్థానికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి సహకరించాలని సూచించారు.