'రైతు కన్నీరు లోకేష్కు క్రీడలా మారింది'
AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్పై వైసీపీ నేత చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శలు గుప్పించారు. రైతు కన్నీరు లోకేష్కు క్రీడలా మారిందని విమర్శించారు. క్రీడల పేరుతో లోకేష్ విదేశీ యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రైతు వ్యతిరేకిలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. రైతుల ఆశయాలను జగన్ కొనసాగించారని పేర్కొన్నారు.