ఎంపీడీవో కార్యాలయాలను తనిఖీ చేసిన వ్యయ పరిశీలకులు
SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పలు ఎంపీడీవో కార్యాలయాలను ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. బోయినపల్లి, ఇల్లంతకుంట ఎంపీడీవో కార్యాలయాలను పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి నవీన్, భారతి, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.