బియ్యం బస్తాలు మోసిన పోలీసులు
PPM: పాచిపెంట మండలం ఘాట్ రోడ్డులో లారీ బోల్తా పడిన విషయం తెలిసిందే. దీంతో ట్రాఫిక్ క్లియర్ చెయ్యడంలో పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారు. సమాచారం అందుకున్న సాలూరు రూరల్ సీఐ రామక్రిష్ణ, పాచిపెంట ఎస్సై లాలం అర్జున్, సివిల్ పోలీసులు లారీలో ఉన్నా బియ్యం బస్తాలను మోసి స్వయంగా పక్కకు తరలించారు. ట్రాఫిక్ క్లియర్ చేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేశారు.