ఊట్కూరు మహిళలకు “అమ్మ అక్షరమాల” పరీక్ష
NRPT: ఊట్కూరు మహిళా సమాఖ్య కార్యాలయంలో “అమ్మ అక్షరమాల” కార్యక్రమంలో మహిళలకు అక్షరాస్యత పరీక్షలు నిర్వహించబడ్డాయి. తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, పిల్లల సహకారంతో తెలుగు చదవడం, రాయడం నేర్చుకున్నారు. ఉల్లాస్ పథకం పరిధిలో వృద్ధులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ఉత్తీర్ణులై అక్షరాస్యతను నిరూపించారు.