రూ. 1లక్ష సాయం చేసిన KUDA ఛైర్మన్ సతీమణి

రూ. 1లక్ష సాయం చేసిన KUDA ఛైర్మన్ సతీమణి

అన్నమయ్య: రైల్వే కోడూరు మండలం మాధవరం పొడు గ్రామానికి చెందిన కుశల్ రాజు ప్రమాదంలో కాలు కోల్పోయిన నేపథ్యంలో, టీడీపీ ఇంఛార్జ్ & KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు సొంత నిధుల నుంచి రూ. 1లక్ష ఆర్థిక సహాయం అందించారు. ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆమె తెలిపారు. స్థానిక ప్రజలు ఆమె సహృదయతను అభినందించారు.