పింఛన్‌లను పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్

పింఛన్‌లను పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్

ATP: గుంతకల్లులోని పలు వార్డుల్లో పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను శనివారం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహమ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. పింఛన్‌ల పంపిణీలో సాంకేతిక లోపం ఏర్పడితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.