ముంబై ఇండియన్స్లోకి విధ్వంసకర వీరుడు
IPL 2026 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ తన మార్క్ చూపిస్తోంది. LSG నుంచి శార్దుల్ ఠాకూర్ను రూ.2 కోట్ల బేస్ ప్రైస్కు ట్రేడ్ చేసుకున్న ముంబై.. ఇప్పుడు మరో విధ్వంసకర ప్లేయర్ను దక్కించుకుంది. గుజరాత్ టైటాన్స్ నుంచి వెస్టిండీస్ ఫినిషర్ రూథర్ ఫర్డ్ను ట్రేడ్ రూపంలో సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా MI వెల్లడించింది.