VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,125, కొత్త మిర్చి ధర రూ.14,811, పత్తి ధర రూ.7,500 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర రూ.25, కొత్త మిర్చి ధర రూ.199 పెరగగా.. అటు పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.