మెగా జాబ్ మేళాలో 285 మందికి ఉద్యోగ అవకాశం
హనుమకొండ జిల్లా కేంద్రంలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించి 285 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించారు. ఏటూరు నాగారం ఎస్ఓ సురేష్ బాబు జాబ్ మేళాలో ఎంపికైన నిరుద్యోగులకు ఎంపిక పత్రాలను అందజేశారు.