కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

గుజరాత్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా 18 ఏళ్ల వయసు ఉన్న జీషన్ అనే విద్యార్థిని ప్రతాప్ చౌరాహ్ ప్రాంతంలో ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయింది. ఉరివేసుకునే ముందే తన బంధువుకు ఫోన్ చేసి చనిపోతున్నట్లు తెలిపింది. ఆ బంధువు ఆమె స్నేహితురాలికి ఫోన్ చేయగా.. తన వెళ్లి చూసే సరికి అప్పటికే చనిపోయి ఉంది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చింది.