డ్రంక్ అండ్ డ్రైవ్లో ముగ్గురికి జైలు శిక్ష
NGKL: కల్వకుర్తిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి కావ్య (భీమయ్యకు 5 రోజులు జైలు, రూ.350 జరిమానా), అనిల్ కుమార్, వీరేందర్ గుప్తాలకు ఒక్క రోజు జైలుతో పాటు జరిమానాలు విధించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్లో కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్సై మాధవరెడ్డి హెచ్చరించారు.