దారుణం: బాలికపై సామూహిక అత్యాచారం

దారుణం: బాలికపై సామూహిక అత్యాచారం

TG: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై సామూహిక అత్యాచర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ బాలుడు వచ్చి 'నీ తమ్ముడు కింద పడిపోయాడు' అని బాలికకు మాయమాటలు చెప్పి ఓ ఇంటి వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరు బాలురతో పాటు ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.