క‌నకమహాలక్ష్మి ఆలయంలో అష్టదళ పద్మారాధన

క‌నకమహాలక్ష్మి ఆలయంలో అష్టదళ పద్మారాధన

విశాఖపట్నం నగర దేవత క‌నకమహాలక్ష్మి అమ్మ‌వారి ఆల‌యంలో మంగళవారం అష్టదళ పద్మారాధన సేవను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముగ్గురు ఉభయదాతలు పాల్గొని ప్రత్యేక నైవేద్యాలు, పుష్పార్చనలు సమర్పించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ సేవలో ఆలయ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.