ప్రభుత్వ భూమి ఆక్రమణపై CPI ఆందోళన
KDP: వేంపల్లి మండలం పాములూరు ప్రభుత్వ భూమిని ఆక్రమించిన శేషారెడ్డిపై రైతు సంఘ నేతలు, CPI జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డీఆర్వో కార్యాలయంలో సోమవారం డీఆర్వో విశ్వేశ్వర నాయుడుని కలసి పిర్యాదు చేశారు. స్థానికుల సమస్యలకు చర్యలు తీసుకోకపోతే CPI ఆధ్వర్యంలో జెండాలు నాటి పేదలకు పంచే ప్రయత్నం చేస్తామని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.