రైల్వే భద్రతపై SCR జనరల్ మేనేజర్ సమావేశం
HYD: రైల్వే ఆపరేషన్ల భద్రతపై సికింద్రాబాద్ SCR జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపల్ హెడ్లతో కలిసి భద్రతా ప్రమాణాలు, నిర్వహణ విధానాలపై విస్తృతంగా చర్చించారు. డివిజనల్ రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని తమ పరిధిలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.