సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLR: కందుకూరులోని TDP కార్యాలయంలో శుక్రవారం MLA ఇంటూరి నాగేశ్వరరావు CMRF చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్న 58 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 36.5 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. వలేటివారిపాలెం, ఉలవపాడు, లింగసముద్రం, గుడ్లూరు మండలాలకు చెందిన వారికి ఈ సహాయం అందినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.