ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థి

ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థి

KNR: ఇంటర్ ఫలితాల్లో ఓదెల (M) గుంపుల గ్రామానికి చెందిన విద్యార్థిని పంజాల స్వాతి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. శంకరపట్నం ప్రభుత్వ గురుకుల కళాశాలలో చదువుతూ.. కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకు దీటుగా ఏకంగా 987 మార్కులు సాధించి సత్తా చాటింది. ఎలాంటి ఆర్భాటాలు లేని ప్రభుత్వ గురుకుల కళాశాలలో పక్కా ప్రణాళికతో చదివితే అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు.