రేపు విద్యా సంస్థలకు సెలవు
CTR: నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు చిత్తూరు జిల్లాలోని రేపు(గురువారం) అన్ని విద్య సంస్థలకు సెలవు ప్రకటిస్తూ.. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ముందస్తు చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క స్కూలు యాజమాన్యం ఈ నింబధనలు పాటించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.