ఉమ్మడి జిల్లాలో విస్తృత తనిఖీలు

ఉమ్మడి జిల్లాలో విస్తృత తనిఖీలు

MBNR: ఢిల్లీ పేలుళ్ల ఘటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పోలీసులు అప్రమత్తమై నిన్న విస్తృత తనిఖీలు చేపట్టారు. జాతీయ రహదారులు, రాష్ట్ర సరిహద్దులైన గద్వాల జిల్లా అలంపూర్, నారాయణపేట జిల్లా కృష్ణ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అనుమానాస్పద వస్తువులపై దృష్టి సారించి తనిఖీలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.