పాక్ డ్రోన్ కలకలం.. భారత సైన్యం కాల్పులు

పాక్ డ్రోన్ కలకలం.. భారత సైన్యం కాల్పులు

JKలోని LOC వెంబడి పాక్ మరోమారు కవ్వింపు చర్యలు చేపట్టింది. పూంచ్ జిల్లాలోని దిగ్వార్ సెక్టార్‌లోకి పాక్ డ్రోన్ ప్రవేశించింది. అప్రమత్తమైన భారత సైన్యం వెంటనే ఆ డ్రోన్‌ను నేలమట్టం చేసింది. దీనిని కూల్చివేసేందుకు 12 రౌండ్లకు పైగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. గత మూడు రోజులో ఇలాంటి ఘటన జరగటం ఇది రెండోసారి.