వరికుంటపాడులో వీపీఆర్ నేత్ర కార్యక్రమం

వరికుంటపాడులో వీపీఆర్ నేత్ర కార్యక్రమం

NLR: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రారంభించిన వీపీఆర్ నేత్ర కార్యక్రమం రెండో రోజు వరికుంటపాడు మండలం రామాపురం పంచాయతీలో జరిగింది. ఈ కార్యక్రమంలో 231 మంది ప్రజలకు, వైద్య సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 163 మందికి అద్దాలు అవసరమని గుర్తించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పలు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.